Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల తీరుపై అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి ఆగ్రహం
నవతెలంగాణ-వెంకటాపురం
రైతు కల్లాల పురోగతిపై సంయుక్త కలెక్టర్ (స్థానిక సంస్దలు) ఆదర్శ సురభి అసంతృస్తి వ్యక్తం చేశారు. 5 ఎకరాల పైబడి ఉన్న రైతులను గుర్తించడంలో అదికారులు వైఫల్యం చేందారని మీ పనితీరు ఇలా ఉంటే.. ఇక్కడుండాల్సిన పనిలేదని మండల అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం స్దానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల అధికారులు , ప్రజాప్రతి నిధులతో మండలంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి పై సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో స్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్, పంచాయితీలో ఉపాధిహమీ కూలీలకు కల్పిస్తున్న పనిధినాలు, డ్రైనేజీ ప్లాట్ పామ్ల నిర్మాణం, పారిశుధ్య నిర్వాహణ తదితర అంశాలపై పనుల పురోగతిని సమీక్షించారు. పల్లెప్రకృతి వనాలు మినహా అభివృద్ధి పనుల పురోగతి పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి బుధవారం మండల అభివృద్ది పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించారు. సమీక్షా సమావేశానికి హజరు కావాల్సిన అధికారులు, పంచాయితీ కార్యధర్శులు గైర్హాజరు కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. హాజరుకాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఎంపీడీఓ అనురాధకు సూచించారు. పంచాయితీల్లో స్మశాన వాటికలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలు పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. ప్రతి పంచాయితీలో 60మందికి పైగా ఉపాధిహమీకూలీలకు పనికల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల పురోగతిలో నిర్లక్ష్యం వహిస్తే పంచాయితీ కార్యదర్శులు, ఉపాధిహమీ టెక్నికల్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు.