Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వామపక్ష పార్టీలు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు, బలపరిచిన ఎమ్మెల్సీఅభ్యర్థి బి జయసారథి రెడ్డిని గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి కోరారు. బుధవారం జనగామ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులతో మాట్లాడిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి పాల్గొని మాట్లాడారు. పట్టభద్ర ఎన్నికల్లో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ,వామపక్ష పార్టీలు ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘాలు, మద్దతుతో పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు, పీిఆర్సి ఇవ్వలేదని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేదన్నారు. ఖాళీగా ఉన్న మూడున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులకు నాశనం చేసే నిర్బంధ పదవీ విరమణ చట్టం తెస్తోందన్నారు. బ్యాంకులు, ఎల్ఐసి, బొగ్గు గనులు, టెలికామ్, రైల్వే, విద్యుత్ తరంగాలను ప్రైవేటుపరం చేసి నిరుద్యోగుల ఆశలకు గండి కొడుతుందన్నారు. జర్నలిస్ట్ గా అన్ని వర్గాల అంశాలపై అవగాహన ఉన్న తనను ప్రభుత్వాన్ని నిలదీస్తానాని, హక్కులు సాధించేవరకు పోరాడుతానని అన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో బోడ నరేందర్, ధర్మ బిక్షం, సురేష్ పాల్గొన్నారు.
ప్రభుత్వ రంగంలో విద్యా, వైద్యం ఉండాలి : ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారధిరెడ్డి
బచ్చన్నపేట : ప్రభుత్వ రంగంలో విద్యా వైద్యం ఉండాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలంటే చట్ట సభల్లో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని ఎమ్మెలీస అభ్యర్థి జయసారధిరెడ్డి కోరారు. స్థానిక ఆదర్శ పాఠశాల,హైస్కూల్ లో ఉపాధ్యాయులతో కలిసి ఆయన బుధవారం మాట్లాడారు. రాబోయే నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్కిల్లో వామపక్షాలు , ప్రజాసంఘాలు బలపరిచిన తనను మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాలని , నూతన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అన్నారు. కరోనా సందర్భంగా ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. విభజన చట్టం హామీలను అమలు చేయాలని, ఖాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టి జనగామ జిల్లా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రజల సమస్యల్ని పట్టించుకొని పనిచేస్తున్న వామపక్షాలు, ప్రజాసంఘాల తరుపున తనకు ప్రాదాన్యతాఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, మండల కార్యదర్శి గొల్లపల్లి బాపురెడ్డి,మండల కమిటీ సభ్యులు,సందెలరాము, రఘురామయ్య, విద్యార్థి సంఘ నాయకులు దడిగె సందీప్,రఘు, తదితరులు పాల్గొన్నారు