Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి తీరుతాం
- జూనియర్ కాలేజీ తప్పక నిర్మిస్తాం
- వచ్చే బడ్జెట్కి నిరుద్యోగ భృతి అందిస్తాం
- ప్రతిపక్షాల నాయకుల చెంప చెళ్ళు మనేలా ప్రతి
- కార్యకర్త చురుగ్గా పని చేయాలి : ఎంపీ మలోత్ కవిత
నవతెలంగాణ-డోర్నకల్
'ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుం టాం. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి తీరుతాం. డోర్నకల్ పట్టణంలో జూనియర్ కాలేజీ తప్పక నిర్మిస్తాం. డోర్నకల్ మండలాన్ని అభివృద్ధి చేసి ప్రతిపక్షాల నాయకుల చెంప చెళ్ళు మనేలా ప్రతి ఒక్క కార్యకర్త చురుగ్గా పని చేయాలి.' అని మాను కోట ఎంపీ మలోత్ కవిత అన్నారు. డోర్నకల్ పట్టణ కేంద్రంలో బుధవారం మండల అధ్యక్షుడు నున్నా రమణ అధ్యక్షతన నిర్వహిం చిన మండల, పట్టణస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఎంపీ, ఎమ్మెల్యే, నియోజవర్గ యువజన అధ్యక్షుడు రవిచంద్ర లను డోర్నకల్ మండల యూత్ అధ్యక్షుడు కళ్లెపు సతీష్ కుమార్గౌడ్, పట్టణ అధ్యక్షుడు కత్తెర సాల విద్యాసాగర్, డోర్నకల్ నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో డోర్నకల్ మండలం నుంచి టిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిం చాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రైతులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల రైతు బీమా, పంట పెట్టుబడులు చేసుకోవడానికి ప్రతి పంటకు రైతుబంధు అందజేస్తున్నారన్నారు. కళ్యాణలక్ష్మి, కెేసీఆర్ కిట్టు, వివిధ రకాల ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ లకు గురుకుల పాఠశాలలు, కళాశాలు నిర్మించారన్నారు. రైతులకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనం,స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, మున్సిపాలిటీలలో పట్టణ ప్రజల కోసం ప్రతి నెల 14 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం అందిస్తుందన్నారు. రెండు పంటలను పండించుకునేందుకు కాలేశ్వరం ప్రాజెక్టు ను కట్టించి తద్వారా ఎస్సారెస్పీ కాలువల ద్వారా డోర్నకల్ నియోజకవర్గానికి సాగు నీరు అందేలా కృషి చేసిన ఘనత సీఎం కెసిఆర్దేనన్నారు. డోర్నకల్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మిస్తామని, తిరుపతి పోవడానికి పద్మావతి రైళ్లను హాల్టింగ్ కల్పిస్తామన్నారు. డోర్నకల్-గార్ల వెళ్లే మార్గంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి కట్టిస్తామని, వచ్చే మార్చి బడ్జెట్లలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను, నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్తో మాట్లాడి నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నున్న రమణ, ఎంపీపీ బాలునాయక్, మున్సిపల్ చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, మండల యూత్ అధ్యక్షుడు కళ్లెపు సతీష్ కుమార్, సింగిల్విండో చైర్మన్ లు సిహెచ్ బిక్షం రెడ్డి, మన్మధరావు, పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయినపల్లి వెంకన్న, మాజీ జెడ్పీటీసీ గొర్ల సత్తిరెడ్డి, రామనాథం, ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రమ్య శ్రీనివాస్ పాల్గొన్నారు.