Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ రవాణా... అధికార పార్టీ అండదండలు
- అధికారుల అనుమతి
- ప్రయివేట్గా అమ్మకాలు
- గ్రామాల్లో ఖాలీ అవుతున్న వాగులు
- మంత్రి ఎర్రబెల్లి ఇలాఖాలో ఇష్టారాజ్యం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వాగుల్ని తోడేస్తుండ్రు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుకను అక్రమంగా అమ్మేసుకుంటుండ్రు. దీనితో గ్రామీణ ప్రాంతాల్లోని వాగులు ఖాలీ అవుతున్నాయి. అడ్డుపడిన అధికారుల్ని బదిలీ చేస్తుండ్రు. ఇదేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అది అంతే మా ప్రభుత్వం, మా ఇష్టమని అంటుండ్రు. ఏకంగా జిల్లా కలెక్టర్లు ఇచ్చిన అనుమతుల్ని చూపి ఇసుక దందా చేస్తుండ్రు. ఇది మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇలాకాలో ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి.
భవణ నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి. గోదావరి ఇసుక ధరలు తక్కువగా ఉన్నప్పటికీ స్థానికంగా వాగుల్లోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గోదావరి ఇసుక టన్ను ధర 1200 నుండి 1500 వరకు పలుకుతుంది. స్థానిక ఇసుకను 4వేల నుండి 6వేలకు టాక్టర్ చొప్పున అమ్ముతున్నారు. స్థానిక ఇసుకతో పోలిస్తే 1500 నుండి 2వేల వరకు మిగులుతున్నాయి. దీంతో స్థానిక ఇసుకనే వాడడానికి మక్కువ చూపుతున్నారు. దీనిని అదునుగా చేసుకొని ఇసుక వ్యాపారులు రాత్రిరాత్రియే స్థానిక వాగుల నుండి ఇసుకను తరలించి అమ్మేసుకుంట్రు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పుల వాగు ఖాలీ అవుతోంది. చుట్టుపక్కలకు చెందిన వారంతా ఈ వాగు నుండి పట్టపగలే ఇసుక తరలిస్తున్నారు. డబుల్బెడ్రూం ఇండ్ల పేరుతో స్థానిక తహాశీల్దార్ నుండి అనుమతి తీసుకుంటున్నారు. వాగు నుండి పలు చోట్ల డంప్ చేసి రాత్రి వేల ప్రైయివేట్ వ్యాపారులకు అమ్ముతు న్నారు. కొద్ది రోజుల క్రితం ఇసుక రవాణాను తహాశీల్దార్ అడ్డుకోగా అయనను బడిలీ చేయించిన పరిస్థితి. కొడకండ్ల మండలలో జరిగే నిర్మాణాలకు సైతం దేవరుప్పుల మండలంలోని గొల్లపల్లి నుండి ఇసుకను తరలిస్తున్నారు. దేవరుప్పుల వాగు నుండి పెద్దమొత్తంలో ఇసుక తరలిస్తున్నా మంత్రి దయాకర్రావు పట్టించుకోకపోగా ప్రోత్సహిస్తు న్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఆకేరు వాగు నుండి రోజుకు వెయ్యి టాక్టర్లు
వర్ధన్నపేట మండలంలోని కొత్తపల్లి, వర్ధన్నపేట, ఇల్లంద, ల్యాబర్తి నుండి పెద్ద మొత్తంలో ఇసుక తరలిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం వరకు వెయ్యి టాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్న పరిస్థితి. రాయపర్తి మండల కేంద్రానికి 200 టాక్టర్ల ద్వారా తరలిస్తుండగా వర్దన్నపేటకు 500 టాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇతర మండలాలకు మరో 300 టాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఆకేరు వాగు జనగామ ప్రాంతం నుండి ప్రారంభం అవుతుంది. ఐనవోలు మండలం నందనం వద్ద భారీగా ఇసుక మేటలు ఉంటాయి. అదే విధంగా కొత్తపల్లి, ఇల్లంద, ల్యాబర్తి వద్ద నాన్యమైన ఇసుక లభిస్తుంది. ఇక్కడి నుండి ఏకంగా వరంగల్కు సైతం తరలిస్తున్న పరిస్తితి. ఇలా స్థానిక వాగులు ఖాలీ అవుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. మూడు మాసాల క్రితం రెండు, మూడు రోజులకు ఒకసారి ఇరవై, ముప్పై టాక్టర్లు సీజ్ చేసే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఒక్క టాక్టర్ కూడా సీజ్ చేయడం లేదు.
జిల్లా కలెక్టర్ల లేఖలతో మోసాలు
ప్రభుత్వ భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు స్థానిక వాగుల నుండి ఇసుకను తరలించుకునే విధంగా స్థానిక కలెక్టర్లు అనుమతి లేఖలు ఇచ్చారు. అయితే కాంట్రాక్టర్లు ప్రభుత్వ భవనాల వద్ద పో యాల్సిన ఇసుకను తమ సొంత పనుల వద్దకు తరలిస్తున్నారు. జనగామలో ఒక కాంట్రాక్టర్ 2 కోట్లతో నిర్మాణం చేసే ప్రభుత్వ భవనానికి రెండు గ్రామాల నుండి అనుమతి తీసుకున్నారు. ఒకేచోట డప్పింగ్ చేస్తూ అక్కడే సన్న, దొడ్డు ఇసుకగా జల్లెడ పట్టి సొంత పనులకు తరలిస్తున్న పరిస్థితి. ఆ కాంట్రాక్టర్కు ఇసుక తరలించే ఇద్దరు ట్రాక్టర్ యజమానులు సైతం రెండు ట్రాక్టర్లు ప్రైయివేట్గా అమ్ముకొని ఒక ట్రాక్టర్ ప్రభుత్వ పనుల వద్ద పోస్తున్న పరిస్థితి. ఇది ఒక్క జనగామలోనే కాకుండా అంతా జరుగుతోంది. పాలకుర్తి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పేర అనుమతులు పొంది 80శాతానికి పైగా ప్రైయివేట్గా అమ్ముకుంటున్నారు. ఇలా కలెక్టర్ల లేఖతో ఇసుక వ్యాపారులు మోసాలకు పాల్పడు తున్నారు.