Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేసీతో కుందారం గ్రామ రైతులు
నవతెలంగాణ-జనగామ
రిజర్వాయర్ కాల్వల కింద కోల్పోతున్న భూమికి సంబంధించి సరైన పరిహారం ఇవ్వకపోతే భూములను వదులుకునేది లేదని రైతులు తెగేసి చెప్పారు. ఆర్ఎస్ ఘన్పూర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్ వరకు ఏర్పాటు చేస్తున్న ప్రధాన కాలువ వెంబడి తీస్తున్న పిల్లకాలువల ఏర్పాట్లలో భూములు కోల్పోతున్న లింగాలఘనపురం మండలం కుందారం గ్రామ రైతులను పిలిపించి జేసి వనజాదేవి కలెక్టరేట్లో గురువారం మాట్లాడారు. ఎకరాకు రూ.6 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, భూములు ఇవ్వాలని జేసీ స్పష్టం చేశారు. అనంతరం రైతులు మాట్లాడారు. ఎకరాకు రూ.10 లక్షలు ్టపరిహారం చెల్లించాలని కోరారు.