Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరీమాబాద్
గణేష్ ఉత్సవ కమిటీలు, మండళ్లు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని కివి పాఠశాల ప్రిన్సిపాల్ దాసి సతీష్మూర్తి కోరారు. ఆ పాఠశాల విద్యార్థులు మట్టి విగ్రహాల ప్రతిష్టాపన వల్ల గల ప్రయోజనాలను వివరిస్తూ వరంగల్లోని అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సతీష్మూర్తి మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. మట్టి విగ్రహాలను వినియోగిస్తే ఎలాంటి నష్టమూ ఉండదని చెప్పారు. మట్టి, పిండితో తయారు చేసిన విగ్రహాల వల్ల ప్రజారోగ్యానికి నష్టం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజలు అవగాహన పెంచుకుని చైతన్యవంతులై మట్టి విగ్రహాల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అన్నదేవర ప్రవీణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మట్టి వినాయకుడిని పూజిద్దాం : సీపీ
హన్మకొండ : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుడిని పూజించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) సుధీర్బాబు కోరారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ విభాగం, తెలంగాణ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను గురువారం సీపీ సుధీర్బాబు చేతుల మీదుగా హన్మకొండ చౌరస్తాలో ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం సీపీ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలకు బదులు మట్టితో తయారు చేసినవి వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ వేణుగోపాల్, ఏసీపీ మురళీధర్, ఇన్స్పెక్టర్లు సంపత్రావు, కిషన్, కిషోర్కుమార్, తెలంగాణ జాగృతి అర్బన్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, అధికార ప్రతినిధి సుమన్, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడాలి : పద్మ
ప్రజలు, వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులు మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ కోరారు. హన్మకొండలోని పోచమ్మఉంటలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలను సంతోష్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి విగ్రహాలను గురువారం అందించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. వివిధ రకాల రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ డివిజన్ అధ్యక్షులు దొంతుల వాసుదేవరెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి కురిమిళ్ల సది, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు మాందాటి వినోద్, శనిగరం విజరుకుమార్, సీత వేణు, కుందారపు శ్రీను, కురుమ సతీష్, ఉప్పుల ప్రసాద్, దుబ్యాల చరణ్, కృష్ణ, జిల్లా యువమోర్చా నాయకులు నక్కినేని శ్రీహరియాదవ్, చీకటి వినీత్, వంశీచంద్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.