Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
అమ్మ అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకులు అనాథ వృద్ధులకు సేవలు అందించడం అభినందనీయమని జిల్లా మాతా శిశు సంక్షేమ శాఖ అధికారి ఖమరున్నీసా బేగం అన్నారు. కాజీపేట బాపూజీనగర్లోని ఆ ఆశ్రమాన్ని ఆమె గురువారం సందర్శిం చారు. వృద్ధులతో సదుపాయాలు, ఇతరత్రా పరిస్థితులపై మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఖమరున్నీసా బేగం మాట్లాడారు. వృద్ధులకు పిల్లలు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. వృద్ధా ప్యంలో అనాథలుగా మారడం బాధాకర మన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి అండగా నిలవడం స్ఫూర్తినిస్తోందని నిర్వా హకురాలు శ్రీదేవిని అభినందించారు. వృద్ధాశ్రమానికి తన సహకారం ఉంటుం దని తెలిపారు. అనంతరం వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెండ్యాల రత్నమాల, ఆడెపు రాజమణి, లయన్స్క్లబ్ హన్మకొండ నిర్వాహకులు ఝాన్సీరాణి, కాసు వాణి, వడ్డానం జయశ్రీ, ఆసరా అధ్యక్షురాలు గోపు అరుణారెడ్డి, సహాయ ప్రెసిడెంట్ వెల్దండి రాజేష్, ఆశ్రమ సొసైటీ సభ్యులు పెసరు రవికుమార్, దైద డేవిడ్ రాజ్కుమార్, రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.