Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్
నవతెలంగాణ-హన్మకొండ
జిల్లాలో తొమ్మిది నెలల వయసు నుంచి 15 ఏండ్ల పిల్లలందరికీ వందశాతం మీజిల్ రూబెల్లా టీకాలను వేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్ ఆదేశించారు. గురువారం రాత్రి మీజిల్స్ రుబెల్లా టీకాల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నేటి వరకు దాదాపు 96వేల మంది పిల్లలకు టీకాలను వేసినట్టు తెలిపారు. మిగిలిన పిల్లలందరికీ టీకాలు వేయించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో టీకాలు వేయాలని, పాఠశాలల్లో చేరని 9 నెలల నుంచి 3 ఏండ్ల లోపు పిల్లలకు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలన్నారు. ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాముఖ్యతనివ్వాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో టీకా మందుల కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. న్రపయివేటు, ప్రభుత్వ పాఠశాలల్లో టీకాలు వేసే బాధ్యత ఎంఈవోలదేనని తెలిపారు. జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా సంబంధిత శాఖాధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అనంతరం ఎంఈవోలతో పాఠశాల గ్రాంట్స్, మెయింటెనెన్స్ గ్రాంట్స్ ఇతర గ్రాంట్లపై సమీక్షించారు. పాఠశాలలకు కేటాయించిన గ్రాంట్లపై ప్రధానోపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు అవగాహన కల్పించాలన్నారు. కేటాయించిన నిధులను వినియోగించుకోవాలన్నారు.
ప్రతి పాఠశాలలో హ్యాండ్వాష్ తప్పనిసరి
పాఠశాలల్లో సబ్బులు కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులందరికీ హ్యాండ్వాష్ పై అవగాహన కల్పించి భోజనానికి ముందు, టాయిలెట్కి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు కడుక్కునే విధంగా చూడాలన్నారు. హరితహారంలో విద్యార్థులతో మొక్కలు నాటించి ఆ మొక్కలను విద్యార్థులకు దత్తత ఇచ్చి విద్యార్థి పేరు పెట్టాలని తెలిపారు. హరితహారం మొక్కల సంరక్షణ ఆధారంగా విద్యార్థులకు మార్కులు వేస్తామని, ఆ మేరకు మొక్కలను నాటే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీఎంఅండ్హెచ్వో అశోక్ఆనంద్, డీఈy నారాయణరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి సబిత, మైనార్టీ సంక్షేమాధికారి సర్వర్మియా, బీసీ సంక్షేమ అధికారి నర్సింహాస్వామి, ఎస్సీ అభివృద్ధి అధికారి, మెడికల్ ఆఫీసర్లు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.