Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టర్పై చర్యతీసుకోవాలి, లైసెన్స్ రద్దుచేయాలి
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
మండలంలోని ఇప్పగుడెం గ్రామంలో ఘన్పూర్ నుంచి పాలకుర్తి వరకు ఏర్పాటు చేస్తున్న బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యత పాటించని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దాదాపు గంటసేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గట్లకొండల్రెడ్డి, మండల కార్యదర్శి ఎన్నపూస రాంనర్సయ్య మాట్లాడారు. ఘన్పూర్ నుంచి గుంటూరుపల్లికి 2014లో 13 కిలో మీటర్లు, 15కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. 2014లో టెండర్లు పిలిచి 2017వరకు పనులు పూర్తి చేస్తామని చెప్పి నేటికీ పూర్తి చేయకపోగా నాణ్యత ప్రామాణాలు పాటించడంలేదని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ముఖ్య మంత్రి పాలకుర్తికి వెలుతున్న సందర్భంలో కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని పనులు త్వరగా పూర్తిచేయాలని స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. కానీ నేటికి ఎటువంటి పురోగతి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామకార్యదర్శి యాదగిరి, మల్లారెడ్డి, రాములమ్మ, రాజు, యాకయ్య, కుర్రఉప్పలయ్య, ఐలయ్య, ప్రబాకర్ పాల్గొన్నారు.