Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జఫర్గడ్ : మట్టిగణపతిలను ప్రతిష్టించి పూజించాలని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు తయారు చేసిన 540 మట్టి విగ్రహాలను పరిశీలించి గురువారం పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ మట్టి విగ్రహాల వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు, ప్రజలకు వివరించారు. రసాయన పధార్థాలతో తయారు చేసిన వినాయక విగ్రహాల వల్ల పర్యావరణానికి ముప్పు ఉంటుందని తెలిపారు. రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలను చెరువులలో నిమజ్జనం చేయడంతో నీరు కలుషితం అవుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మనోహరాచారి, ఎంఈవో రాజేందర్, సర్పంచ్ చిరంజీవి, ఎంపీటీసీ లక్ష్మి, ఏపీఎం రమేష్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు.