Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
జనగామ జిల్లాసాధనలో భాగంగా నమోదైన కేసుల విషయమై ఉద్యమకారులు గురువారం జనగామ జిల్లా కోర్టులో హాజరు అయ్యారు. ఈ సందర్బంగా జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్రెడ్డి మాట్లాడుతూ ప్రజాఉద్యమాల ఫలితంగానే జనగామ జిల్లా సాధించామన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా సాధన ఉద్యమంలో నమోదైన కేసులను ప్రభుత్వం పరిశీలించి కొట్టి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టుకు హాజరైన వారిలో కౌన్సిలర్లు ఆకులవేణుగోపాల్రావు, ధర్మపురి శ్రీనివాస్ , జేఏసీ నాయకులు డాక్టర్ లక్ష్మి నారాయణ, జక్కుల వేణుమాధవ్, మంగలం పల్లిరాజు, ఆర్ రత్నాకర్రెడ్డి, విజరుకుమార్, మాజీద్, అన్వర్, సిద్దుగౌడ్, వీరస్వామి ఉన్నారు.