Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
గ్రామీణ ప్రజలు పరిశుభ్రతను పాటిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మండలంలోని ఈరవెన్ను గ్రామ సర్పంచ్ ముసుకు రేవతి అన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా మురికి కాలువలను శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సయ్యద్అహ్మద్, కార్యదర్శి చుక్కా లింగయ్య, కారోబార్ అనుముల కుమార్, వార్డు సభ్యులు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.