Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
సర్వమతాల సారాంశం ఒక్కటేనని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం రాత్రి మండలంలోని కుందారం గ్రామంలోని సద్గురు సాయినాథ్ని 25 ఏండ్ల ఆరాధన ఉత్సవాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతంర ఆయన మాట్లాడుతూ క్రీస్తు, అల్లా, శ్రీరాముడు, అంతా ఒక్కటేనని ఎవరికి నచ్చిన విధంగా వారివారి దేవతలను కొలుచుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిట్ల కృష్ణవేణి, ఎంపీటీసీ గంగసాని భాగ్యమ్మ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్, మండల ఇన్చార్జి చిట్ల ఉపేందర్రెడ్డి, ఏఎంసీ డైరక్టర్లు భాగ్యలక్ష్మ్డి, జిల్లా నాయకులు చేవెల్ల సంపత్, రైతు సంఘం మండల ఉపాధ్యక్షుడు యాదగిరి, మహిళా మండలి ఇన్చార్జి కోతి రాములమ్మ, మండల అధికారుల ప్రతినిధి గణపతి, ఉపసర్పంచ్ రాంచందర్ పాల్గొన్నారు.