Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
సీపీఎఫ్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈ రాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలలో పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను డెమోక్రటీక్ టీచర్ ఫెడరేషన్ (డీటీఎఫ్)ఆధ్వర్యంలో సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష20 వేలమంది ఉపాధ్యాయులను మానసికంగా ఆందోళనకు గురి చేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. సెప్టెంబర్ 1న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యారంగంలో ఉన్న సమస్యలన్నింటికీ కామన్స్కూల్ విధానాలేనని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల బాధ్యులు ఆకుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు డి రాముల, ఎం యాదయ్య, వివిధ సంఘాల బాధ్యులు వెంకన్న, రవీంధర్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.