Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి ఒక్కరు కుండీల్లోనే నిమజ్జనం చేయాలి
- కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
నవతెలంగాణ-లింగాలఘనపురం
ప్రతి ఒక్కరూ మట్టివినాయకుడిని ప్రతిష్టించి, కుండీలోనే నిమజ్జనం చేసి విత్తనం పెట్టి హరిత వినాయకుడిని పూజిద్దామని కలెక్టర్ శ్రీదేవసేన విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, మాడల్స్కూల్లలో విద్యార్థులు చేస్తున్న మట్టి వినాయకుల తయారిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ విద్యార్థులు తమ ఆలోచనలకు అంతు లేకుండా నైపుణ్యతను ప్రదర్శిస్తూ మట్టివి నాయకులను వివిధ రూపాలలో తయారుచేయడం అభినందనీయమన్నారు. నవరాత్రులు పూర్తి అయిన తరువాత వినాయకులను స్థానికంగా ఉండే కుండీలలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలలో కానీ నిమజ్జనం చేసి ఆ నిమజ్జనంలో ఒక విత్తనాన్ని వేయాలని మొలకెత్తిన మొక్కను నాటి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకు బెదరకుండా విద్యాబ్యాసం చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారని తెలిపారు. వ్యాసరచనలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందిన అపర్ణను కలెక్టర్ అభినంధించారు. కళ్యాణి, కార్తిక్ అనే విద్యార్థులకు హరితహారం బ్యాడ్జీలు ధరింపచేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గట్టగల్ల యాదయ్య, ఎంఈవో చంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఏకనాథం, ఏపీడీ వసంత, ఏపీఎం శ్రీనివాసులు, ఏపీవో రమాదేవి, ఏఆర్ఐ సరోజన, వీఆర్వో ఉప్పలయ్య, కార్యదర్శి మల్లిఖార్జున్, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జనగామలో..
ప్రజలు మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్టించే విగ్రహాల తయారుపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు స్థానిక వైష్ణవి హైస్కూల్ విద్యార్థులతో ఆర్టీసీ చౌరస్తాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మట్టివిగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలనే నానుడిని తెలిపేలా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ పారీస్ వాడడం వల్ల ప్రకృతి దెబ్బతిని పర్యావరణ సమస్య తలెత్తుతున్నదని అన్నారు. విద్యార్థులు తమ చిన్న చేతులతో తయారు చేసిన మట్టి విగ్రహాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ఇలాంటి విగ్రహాలనే ప్రజలు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్టించి పూజించాలని పిలుపునిచ్చారు. అలాగే ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బాల్నెసిద్దులు, వైష్ణవి స్కూల్ కరెస్పాండెంట్ సంజీవరెడ్డి, కౌన్సిలర్ జనార్ధన్రెడ్డి, మాజీ కౌన్సిలర్ గజ్జెల నర్సిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పసుల ఏబేలు, దగిరిరెడ్డి పాల్గొన్నారు.
జనగామ డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో
జనగామ జిల్లా డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో సెయింట్ మేరీస్ స్కూల్ విధ్యార్థులు మట్టి విగ్రహాలను పట్టుకుని పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన మట్టివిగ్రహాలను తీసుకుని పట్టణంలోని సెయింట్ మేరీ పాఠశాల నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారీస్ వల్లజరిగే నష్టాలను తెలియజేస్తూ ఆర్టీసీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా డెవలప్మెంట్ ఫోరమ్ నాయకులు ఎండీ అన్వర్, సిద్దుగౌడ్, ఇమ్రాన్, దస్తగిరి పాల్గొన్నారు.
దేవరుప్పులలో..
ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్తో తయారు చేసే వినాయకుల వలన పర్యవరణ పరిరక్షణకు ఆటకం కలుగుతుందని అందుకే మట్టి గణపతులనే ప్రతిష్ఠించి పూజించాలని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. మండలంలోని సింగారాజుపల్లి గ్రామంలో కలెక్టర్ హారితవన గణపతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు మట్టి గణపతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమమహేశ్వర్, సర్పంచ్ పాల్గొన్నారు.