Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బచ్చన్నపేట : మద్యాన్ని నియంత్రించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య డిమాండ్ చేసారు. మండల కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఎర్రోజు దేవేంద్ర అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళను వ్యాపార వస్తువుగా చూడటమే కాకుండా హింస, హత్యాచారాలు, పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలిపారు. ప్రభుత్వ ఆదాయ వనరుగా చూస్తున్నదని కానీ మహిళల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లెల్ల అరుణ, గంధమల్ల సంతోష, ఉమారాణి వేముల సంధ్యారాణి, ఎర్రోజు దేవేంద్ర పాల్గొన్నారు.