Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
కేజీబీవీలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్క రించాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షులు జ్యోతిశ్రీహరి డిమాండ్ చేశారు. మండలంలోని ఖిలాషా పురంలోని కస్తూర్బాగాంధీ బాలికల వసతిగృహంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలపై అలుపె రుగని పోరాటం చేస్తున్నామన్నారు. ఉపాధ్యా యుల సమస్యలపై పోరాడేది యూటీఎఫ్ అని ఆయన అన్నారు.కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యో గులను తెలంగాణ ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా కనీస వేతనం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ఉద్యోగులకు 10 పీఆర్సీ అమలు చేస్తూ కేజీబీవీ టీచర్లకు మాత్రం తొమ్మిదో పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వడం అన్యాయమని అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు మహిళలు కావడంతో వారి సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఈ నెల 28న కలెక్టర్ కార్యాలయం ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. ధర్నాకు సంబంధించి కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ నాయకులు టేకులపల్లి జంపయ్య, సీహెచ్ నాగరాజు, స్పెషల్ ఆఫీసర్ జీవనప్రియ, శైలజ, బేబీ, ప్రభ, శోభ,వినోద, శ్రీలత పాల్గొన్నారు.