Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులు దరఖాస్తు చేసుకోవాలి
- జిల్లా వ్యవసాయాధికారి వీరునాయక్
నవతెలంగాణ-జనగామ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై 190 ట్రాక్టర్లను అందజేసేందుకు నూతనంగా అందుబాటులో పెట్టిందని జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్ అన్నారు. పట్టణంలోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ సంవత్సరానికి గాను సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లు అందించనున్నట్టు తెలిపారు. 190 ట్రాక్టర్లకు గాను 6.65కోట్లు ఖర్చు అవుతున్నట్టు తెలిపారు. ఇందులో 16 ట్రాక్టర్లు ఎస్సీ, ఎస్టీరైతులకు 9 ట్రాక్టర్లు 95శాతం సబ్సిడీపై అందిచనున్నట్టు తెలిపారు. అలాగే 142 ట్రాక్టర్లు 50శాతం సబ్సిడీలపై మిగిలిన రైతులకు అందిస్తున్నట్టు తెలిపారు. ఇందుకుగాను 2.5ఎకరాల భూమి కలిగి ఉండి వ్యవసాయం చేస్తున్న రైతులు అర్హులు అన్నారు. గ్రామస్థాయిలో రైతులు తమ దరఖాస్తులను మండలంలోని వ్యవసాయఅధికారి కార్యాలయంలో అందజేయాలని వీటిని త్రి సభ్యకమిటీ పరిశీలించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.