Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుగ్గొండి
టీడీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజావ్యతిరేక విధానాలపై చర్చ జరిపారు. మండలంలోని గిర్నిబావిలో గల ఓ ఫంక్షన్హాల్లో ఆ పార్టీ మండల అధ్యక్షులు చుక్క రమేష్ నేతృత్వంలో ముఖ్య కార్యకర్తల సమావేశం గరువారం నిర్వహించారు. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని నర్సంపేట పట్టణంలోనే ఏర్పాటు చేయాలన్నారు. అందుకు 26న నర్సంపేట పట్టణాన్ని దిగ్భందం చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ కార్యదర్శి రవీందర్ నాయక్, మాజీ ఎంపీపీ బూర్గు రవీందర్, సర్పంచ్ సారంగపాణి, శ్రీనివాస్, రామారావు, వెంకటయ్య, కిషన్ తదితరులున్నారు.