Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుగ్గొండి
మండలంలోని నాచినపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఓరుగంటి వేణుకుమార్ను గురువారం తొలగించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నర్సంపేట ఆర్డీవో రవి సమక్షంలో టీఆర్ఎస్కు చెందిన 8మంది వార్డు సభ్యుల మెజార్టీతో అవిశ్వాసం ప్రవేశపెట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ వేణుకుమార్ పదవీచ్యుతులైనాడు. 12మంది వార్డు సభ్యుల్లో 8మంది టీఆర్ఎస్ అనుబంద సభ్యులు కావడంతో ఉపసర్పంచ్ తన పదవీ కోల్పోయాడు. సంఖ్యాబలం లేకపోవడంతో ఉపసర్పంచ్ను పదవీ నుంచి తొలగించినట్టు తెలిపారు. సర్పంచ్ గోవిందు అనిత, తహసీల్దార్ సత్యనారాయణరావు, ఈవోపీర్డీ ఖాజామైనోద్దిన్ పర్యవేక్షించారు.