Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ
మండలంలోని బొల్లికొండ, తోపనపల్లి గ్రామాలను దోషరహిత రెవెన్యూ రికార్డుల గ్రామాలుగా మార్చేందుకు రెవెన్యూ అధికారులతో ఇంటింటి సర్వేను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తహసీల్దార్ విశ్వనారాయణ తెలిపారు. రెవెన్యూ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి రెండు గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామన్నారు. మండలంలోని పత్తిపాక గ్రామంలో రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వేను నిర్వహించి రెవెన్యూ రికార్డులను సరి చేయడం జరిగిందని, గ్రామసభను నిర్వహించి పత్తిపాక గ్రామాన్ని రెవెన్యూ రికార్డుల దోష రహితం గ్రామంగా ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ప్రజలు సహకరించాల్సిందిగా కోరారు.