Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
మట్టితో చేసిన విగ్రహాలనే ప్రతిష్టించాలని బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ రాజేంద్రప్రసాద్రెడ్డి అన్నారు. మండలంలోని బాలాజీ విద్యాసంస్థలకు చెందిన కళాశాల, పాఠశాలల ఆధ్వర్యంలో వేర్వేరుగా విద్యార్థులు పట్టణంలో మట్టి విగ్రహాలపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ''మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం'' అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించి రాజేంద్రప్రసాద్రెడ్డి మాట్లాడారు. పర్యావరణాన్ని పరిరక్షించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడే మానవాళి మనుగడకు సాధ్యపడుతుందని తెలిపారు. లక్నెపెల్లిలోని బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై రెండు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తయారు చేసిన వంద మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిట్స్ ప్రిన్సిపాల్ వీఎస్ హరిహరన్, బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, అక్షర స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి, బిట్స్ వివిధ విభాగాధిపతులు, బాలాజీ విద్యాసంస్థల ఎవో ఎస్ సురేష్, మేనేజర్ పి యాదగిరి, ప్రోగ్రామ్ ఆఫీసర్ రాధాకృష్ణ , జీవన్, 300 మంది వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఖానాపురం : సంప్రదాయబద్ధంగా పర్యా వరణహితమైన మట్టి వినాయక ప్రతిమలను పూజించి, పర్యావరణాన్ని కాపాడుకోవాలని సెయింట్మేరీస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కంభంపాటి ప్రతాప్ అన్నారు. మండలంలోని ఐనపల్లిలోని రుద్రమదేవి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినీలు గురువారం మట్టి వినాయక ప్రతిమను తయారు చేశారు.ఈ సందర్భంగా విద్యార్థినిలను అభినందించారు. ప్రతి విద్యార్థినీ సమాజం పట్ల తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కిషన్రెడ్డి పాల్గొన్నారు.