Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని దౌలత్నగర్ గ్రామంలో పర్యటించిన ఎంపీ దయాకర్ను ఇస్లావత్ తండావాసులు రోడ్డు మరమ్మత్తు చేయించాలని నిలదీశారు. దీంతో స్పందించిన ఎంపీ వర్ధన్నపేట ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అయినప్పటికీ తండావాసులు నమ్మకం లేక ఎమ్మెల్యే రమేష్ ప్రజాసమస్యలపై దృష్టిసారించడం లేదని కేవలం శంకుస్థాపనలు, ప్రారంభ కార్యక్రమాలకే పరిమితమయ్యారని వారు ఎంపీతో వారి గోడును వెలిబుచ్చారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మా రోడ్డు పరిస్థితిని చూడటానికి మాతండాకు రావాలని పట్టుబట్టడంతో ఎంపీ నిరాకరించారు. దీంతో తండావాసులు ఆగ్రహానికి గురై ఆందోళనకు దిగారు. తాండావాసులు ఆందోళనను పట్టించుకోకుండా ఎంపీ వెళ్లిపోవడం విశేషంగా మారింది. కార్యక్రమంలో రమేష్, నెహ్రుచందర్, యాకూబ్, లక్ష్మణ్, రాములు, చక్రమ్ తదితరులున్నారు.