Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాల
పల్లేరు స్వయంప్రభ స్మారక వ్యాసరచన, దేశభక్తి గీతాల పోటీలను ఇటీవల స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన విషయం తెలిసిందే.ఆ పోటీల్లో విజేతలుగా నిలిచినవారి పేర్లను నిర్వాహకులు కాటూరి శ్రీధరాచార్య, ఏరుకొండ రామదాసు గురువారం ప్రకటించారు. డిగ్రీ కళాశాలల విభాగంలో రాజశేఖర్, నాగేశ్వరి, శ్రావ్య ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచినట్టు తెలిపారు. జూనియర్ కళాశాలలు, హైస్కూల్ విభాగంలో శ్వేత, నిహారిక, సిరి, వైష్ణవి, క్రిష్ణప్రియ, రశ్మికపటేల్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినట్టు తెలిపారు. వీరికి శనివారం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ల చేతుల మీదుగా బహుమతి ప్రదానం ఉంటుందని తెలిపారు.
రోగులకు పండ్లు పంపిణీ
పల్లేరు స్వయంప్రభ 12వ వర్థంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బండి ఆగయ్య, నాయకులు కోడెపాక సమ్మయ్య, ఏరుకొండ రామదాసు, పల్లేరు స్వయంప్రభ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.