Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మట్టితో తయారుచేసిన వినాయకుడి విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించాలని కోరుతూ మండలంలోని చింతనెక్కొండ విజ్ఞానభారతి విద్యాలయం విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఏ సతీష్కుమార్ మాట్లాడుతూ మట్టి విగ్రహాల వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చన్నారు. అనంతరం విద్యార్థులచే తయారుచేయబడిన మట్టి గణనాధులను పలువురికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తూర్పాటి ఎల్లమ్మ, ఎంపీటీసీ కుడికాల శ్రీధర్, ఉపాధ్యాయులు అనిల్ కుమార్, కమలాకర్, రజితరాజు తదితరులున్నారు.
విశ్వజనిత్ పాఠశాలలో : మండల కేంద్రంలోని విశ్వజనిత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులచే మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను గ్రామస్తులకు అందజేసినట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్ ఎర్రబెల్లి హరికుమార్ తెలిపారు.