Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాల
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని పరకాల పట్టణ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ డాక్టర్ నాగబండి విద్యాసాగర్ కోరారు. గురువారం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్, విద్యుత్ ఏడీఈకి వినతిపత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గణపతి మండపానికి ఎలాంటి చార్జి లేకుండా ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే ఊరేగింపుకు కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని, వాటిని సరి చేయాలని కోరారు. అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగేలా చూడాలని తహశీల్దార్కు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు బండి సారంగపాణి, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, నాగుర్ల రాజేశ్వర్రావు, తోట రవి, మార్త విక్రమ్, కాచం గురుప్రసాద్, కోడూరి మల్లేశం పాల్గొన్నారు.