Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న శాయంపేట ఎంపీడీవో రమాదేవిని సస్పెండ్ చేయాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మారపెల్లి క్రాంతికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదుకోవాలని కోరుతూ గురువారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ ఎంపీడీవో రమాదేవి బహిరంగంగా ఉద్యోగుల నుంచి ప్రతీ పనికి కమిషన్లు వసూలు చేయడమే కాకుండా వేధింపులకు గురి చేస్తుందన్నారు. కమిషన్ ఇవ్వని అధికారుల వేతనాలను నిలుపుదల చేస్తుందని, వేధింపులకు పాల్పడడంతో సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్ ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం యువకుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శాయంపేట ఎంపీడీవో రమాదేవిపై విచారణ చేపట్టి ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ నాయకులు నాలికె ప్రతాప్, భిక్షపతి, రాజు, శ్రీకాంత్, కిరణ్ పాల్గొన్నారు.