Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుగ్గొండి
వరంగల్ రూరల్ జిల్లాలో దివ్యాంగుల సేవా సొసైటీ ఏర్పాటు చేయడం శుభపరిణామమని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండలంలో సాయి అనురాగ్ రీహాబిలిటేషన్ సేవా సొసైటీ ప్రారంభోత్సవ కార్య క్రమం గురువారం నిర్వహించగా ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం తరహాలో తీసుకొస్తు న్నట్లు తెలుస్తోందని చెప్పారు. మల్లికాంబ మనోవికాస కేంద్రం తరహాలో ఎదగాలని ఆకాంక్షించారు. ఒకరికొకరు సహకరించుకునే ధృక్పథంతో సమస్యలను పరిష్కరించాలని నిర్వాహకులకు సూచించారు. దివ్యాంగు లను సమాజంలోని కొందరు చిన్నచూపు చూడటం తగదన్నారు. వాస్తవం గా తల్లిదండ్రులు కూడా వికలాంగ బాలలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని తెలిపారు. సొసైటీలోని వికలాంగులకు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేలా చొరవ చూపుతానని భరోసా కల్పించారు. దివ్యాంగులకు పరిక రాలు అందించడంతో పాటు ఆర్థికంగా వస తులు కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్డీఓ రవి మాట్లా డారు. దివ్యాంగుల సొసైటీకి ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు. తొలుత పెద్ది సుదర్శన్రెడ్డి, ఆర్డీఓ రవి సొసైటీని ప్రారంభిం చారు. కార్యక్రమంలో మేర్గు రాంబాబు, తహసీల్ధార్ సత్యనారాయణరావు, ఎంపీడీఓ భాస్కర్, నర్సంపేట ఐబీ డీఈఈ సుదర్శన్రావు, సర్పంచ్ చందన, ఎంఈఓ ప్రశాంత్, ఎస్సై భాస్కర్రెడ్డి, డాక్టర్ కొమురయ్య, ఎంపీటీసీ జిల్లెల సాయికుమార్, ఏఓ చిలువేరు దయాకర్, సొసైటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.