Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిట్స్ చైర్మన్ రాజేంద్రప్రసాద్రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
సాంకేతిక అభివృద్ధిని విద్యార్థులు అంది పుచ్చుకోవాలని బాలాజీ విద్యాసంస్థల (బిట్స్) చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్రెడ్డి సూచించారు. తద్వారా విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలో రాణిం చాలని ఆయన ఆకాంక్షించారు. మండలంలోని లక్నెపల్లి శివారులోని బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో 'అడ్వాన్స్డ్ ట్రెండ్స్ ఇన్ డేటాబేస్' అంశంపై సీఎస్ఈ విభాగ విద్యార్థులకు గురువారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్ధేశించి రాజేంద్రప్రసాద్రెడ్డి మాట్లాడారు. సమాచార సంక్షిప్తం, పునర్వినియోగం వంటివి చాలా కీలకమని చెప్పారు. సమాచారాన్ని వా ్యపార వ్యవహరాలకు అనుగుణంగా మార్చడం అత్యంత ముఖ్యమైన విషయమన్నారు. ప్రతి రోజూ ఉత్పత్తి అయ్యే మిలియన్లకొద్దీ సమాచా రాన్ని భద్రపరచడం కోసం సముద్రాన్ని, విశ్వాన్ని వినియోగించుకోవడం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతోందని తెలిపారు. కళాశాలలో ఏటా జరుగుతున్న ప్రాంగణ నియామకాల వల్ల అనేక మంది విద్యార్థులు ఉత్తమ డేటాబేస్ అడ్మిస్రే ్టటర్లుగా ఎదుగుతుండడం సంతోషకరమని చెప్పారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరిహరన్ మాట్లాడారు. విద్యార్థులు నూతన డేటాబేస్ టూల్స్ పట్ల అవగాహన పెంచుకోవా లని సూచించారు. అనంతరం కాయిన్ ఈడీ యూ ఐటీ సర్వీసెస్ ప్రతినిధి నవీన్ మాట్లా డారు. అడ్వా న్స్డ్ డేటాబేస్ వినియోగం గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమం లో సీిఎస్ఈ విభాగాధిపతి పర్వేజ్ అహ్మద్, కో-ఆర్డినేటర్ ఆశిష్లడ్డా, ఏఓ సలేంద్ర సురేష్, మేనేజర్ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.