Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెగుళ్లపై జాగ్రత వహించాలి
- మండల వ్యవసాయాధికారి కర్ణాకర్
నవతెలంగాణ-దేవరుప్పుుల
ప్రస్తుతం మండలంలో అసాధరణ వర్షధార పరిస్థితుల దృష్ట్యా రైతులు తగు జాగ్రతలు వహించాలి. ఆగస్టు చివరి వారం వరకు నాట్లు నాటుకునే వీలుంది. తరువాత ఖరీఫ్ పంటలకు చలి మొదలు కావడంతో నాట్లు వేసిన పెద్దగా ఫలితం ఉండదు. వరి నాటిన 15రోజుల నుండి 50రోజుల దశలో ఉన్న వరి పైరులో సస్యరక్షణలో మెళకువలు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చునని ఏవో కర్ణాకర్ వివరిస్తున్నారు.
ప్రస్తుత ఖరీఫ్లో వరిపైరు 15-50 రోజుల దశ మధ్యలో ఉన్నాయి. ముఖ్యంగా సన్నబియ్యం రకాలైన బీపీటీ, సాంబా, జైశ్రీరాం, సూపర్ అమస్, తెలంగాణ సోనా వంటి రకాలలో కాండము తొలుచు పురుగు ఆశించినట్లు రైతుల నుంచి తెలుస్తోంది. అలాగే ముదురు నార్లు లేదా ఆలస్యంగా సారుపోసి నాటిన వరి మడుల్లో హిస్సా, కట్వార్క్, ఉల్లికోడు వంటి తెగుళ్లు ఆశించినట్లు సమాచారం ఉంది. కాబట్టి రైతులు వరి పంటను అశించే పురుగులపై నిఘా ఉంచి రాబోయే 45రోజుల కాలంలో ఆప్రమంతంగా ఉండాలి. తెగుళ్లు ఆశించకుండా తగు చర్యలు చేపట్టాలి.
ప్రధానంగా ముదురునార్లు నాటే రైతులు తప్పనిసరిగా నారు పైభాగం తుంచి నాటాలి. నాటిన 10-15 రోజుల్లోపు కార్బోప్యూరన్ 3జీ గుళికలను ఎకరానికి 10కిలోల చొప్పున మడిలో పలుచగా నీరు ఉంచి చల్లాలి. దీని వల్ల డాల్లికోడు, కాండం తొలుచే పురుగులు ఆశించవు. వీలైనంత కాలి బాటలు వదలడం వల్ల గాలిచేనుకు తగిలి దోమలకు స్థానం లేకుండా ఉంటుంది.
40-50రోజుల వయస్సు ఉన్న పైర్లలో కార్టాప్హైడ్రోక్లోరైడ్ను నీటిలో కరిగే పొడిని లీటర్ నీటికి ఎకరాకు 400 గ్రాముల చొప్పున పిచికారి చేయాలి. ఇలా చేస్తే కాండం తొలచు పురుగు, ఆకు తొలుచు, ఆకు ముడుత వంటి వాటిని నివారించవచ్చు. పాముపొడ, పొట్టకుళ్లు, గింజమచ్చ తెగుళ్లు ఆశిస్తే హెక్సాకొనజోల్ 2మిల్లీ లీటర్లు లేదా కార్బాడాజిల్, మాంకొజేట్ల మిశ్రమాన్ని 2.5గ్రాముల ప్రొపికొనజల్ ఒక మిలీలీటర్ను నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
ఆకునల్లి నివారణకు డైకొఫాల్ 5 మిల్లీ లీటరు లేదా స్ఫైరోమెసిఫెస్ 1మిల్లీ లీటర్ను నీటికి కలిపి పిచికారి చేయాలి. హిస్సా(తాటకు తెగుళ్లు) ఆశించిన ప్రాంతాల్లో మాత్రమే ప్రొఫెనోఫాస్, క్వినాల్ఫాస్ను 2మిల్లీ లీటర్లను నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. రైతులు దోమ ఉధృతికి దోహదం చేసే మందులు క్లోరిపైరిఫాస్, దాని కాంబినేషన్ మందులు ప్రొఫెనోఫాస్, సింథటిక్ ఫైరిడ్రాయిడ్, వివిధ రకాల మందులను వ్యవసాయ ఆధికారుల సూచనలతో మాత్రమే వేయాలి.
ప్రత్తి పంటలో సైతం సరైన వర్షాభావం లేకపోవడం వల్ల మషి పేను, వివిధ రకాల తెగుళ్లు ఏర్పడుతున్నాయి. వ్యవసాయ ఆధికారుల సూచనలతో మాత్రమే రసాయనిక ఎరువులను వాడలి.