Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న మీజిల్స్, రుబెల్లా టీకాల కార్యక్రమం
ప్రపంచ ఆరోగ్య సదస్సులో తీర్మాణించిన విధంగా 2020 నాటికి దేశంలో మీజిల్స్ (తట్టు), రూబెల్లా వ్యాధిని నియత్రి ంచ డానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 17 నుంచి ఐదు వారాల పాటు రూబెల్లా టీకాలు పిల్లలకు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహనా సద స్సులు, ప్రచారాలు జరుగుతున్నాయి.
నవతెలంగాణ- వరంగల్ డెస్క్
తట్టు లేదా పొంగు అనే వ్యాధినే ఆంగ్లంలో మీజిల్స్ రూబెల్లా అంటారు. ఈ అంటువ్యాధి ప్రధానంగా పిల్లల్లో వస్తుంది. ఇది మార్బిల్లీ వైరస్ వలన వ్యాపిస్తుంది. తట్టు క్రీ.పూ 600 సంవత్సరం నుంచే ఈ వ్యాధి ఉన్నట్టు ఆధారాలున్నాయి. మధ్య పర్షియా వైద్యుడు ఈబిన్ రాజీ ఈ వ్యాధి గురించి 860-932 సంవత్సరాల మధ్య విశ్లేషణ చేశారు. తట్టు, ఆటలమ్మ వాధ్యులకు మధ్య గల వ్యత్యాసాలను వివరిస్తూ పుస్తకం కూడా రాశాడు. అనంతరం డేవిడ్ ఈ వైరస్ను వేరు చేసి కోడి గుడ్డుభ్రూణం (చిక్ ఎంబ్రియె)లో వ్యాప్తి చెందేటట్టు చేశారు. ఇప్పటీ దాకా 21 రకాల తట్టుని కలిగించే మీజిల్స్ వైరస్ జాతులు వేరు చేయబడ్డాయి. 1963 సంవత్సరంలో తట్టు వ్యాధి నిరోధక టీకా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
తొమ్మిది నెలల నుంచి 15 ఏండ్లలోపు వయస్సు గల పిల్లలందరికీ టీకాలు వేసేటట్టు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ టీకా చిన్నారుల్లో రక్షణ వ్యవస్థను పెంపొందిస్తుంది. మీజిల్స్ వైరస్ వ్యాక్సిన్ యాంటిబాడీస్ను ఉత్పత్తి చేసి, శరీరాన్ని రక్షించేందుకు సహాయపడే ప్రోటీన్లను అందిస్తుంది. దీంతో చిన్నారుల్లో తట్టు వ్యాధిని నివారించవచ్చు. తొమ్మిది నెలలు నిండిన బిడ్డకు ఈ టీకా వేస్తారు. అయితే ఇప్పటి వరకు మన దేశంలో కేవలం 60 శాతం మంది చిన్నారులు మాత్రమే ఈ టీకాలు తీసుకున్నారని అధికారుల లెక్కలు చెప్పుతున్నాయి.
వ్యాధి వ్యాప్తి
తట్టు సంబంధించిన వైరస్ సాధారణంగా శ్వాసతో పాటు వచ్చే తుపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో జబ్బు ఎక్కువగా ప్రబలుతుంది. సాధారణంగా ఈ జబ్బు ఇన్కుబేషన్ పీరియడ్ 4-12 రోజులు (రోగ క్రీములు శరీరంలోకి ప్రవేశించినప్పటి నుంచి రోగ లక్షణాలు కనిపించడానికి పట్టే సమయం).
ప్రపంచ వ్యాప్తంగా ఎంఎంఆర్ నిర్మూలన
ఈ మధ్యకాలంలో జపాన్ దేశంలో తట్టు వ్యాధి చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఆకస్మాతుగా వ్యాధి ప్రబలడంతో విద్యా, వ్యాపార, విద్యాలయాలు మూసివేయాల్సి వచ్చింది. 1990వ సంవత్సరంలో గవదలు, రూబెల్లా వ్యాధిని నిర్మూలించడానికి ప్రణాళిక తయారు చేశారు. ఉత్తర ఆమెరికా, మధ్య అరేబియా, మధ్య అమెరికా దేశాల్లో సమూలంగా నిర్మూలించారు. కానీ తరువాత మళ్లీ వ్యాపించింది.
వ్యాధి లక్షణాలు
- కండ్లు ఎర్రపడటం
- నోటి లోపలి బుగ్గలలో కాప్లిక్ స్పాట్స్ (ఇసుక రేణువుల వంటి మచ్చలు) కనిపించడడం. ఇవి 24-26 గంటలు మాత్రమే ఉంటాయి. రాజ్ ప్రారంభమై జ్వరం తగ్గుముఖం పట్టగానే కాప్లిక్ స్పాట్స్ కనిపించావు.
- తలనొప్పి
- ఒంటిపై దద్దులు
- మెడ నొప్పులు
- మూడ్రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉండటం
- దగ్గు
- మగతగా ఉండడం
వ్యాధికి కారణమమ్యే వైరస్ గురించి
ఈ వైరస్ మీజిల్స్ వైరస్ అని పిలుస్తారు. పారామిక్సోవైరిడే కుటుంబానికి చెందిన అన్ని వైరస్ల వలే ఈ వైరస్ ఆర్ఎన్ఏ అనే కేద్రక ఆమ్లంతో నిర్మించబడి ఉంటుంది.
వ్యాధి నిర్ధారణ.. చికిత్స
రోగి శరీరంపై దద్దుర్లు వస్తే దాదాపు తట్టు వ్యాధిగా నిర్ధారణ చేస్తారు. వైరస్ వల్ల వచ్చే అన్ని వ్యాధుల్లో జ్వరం, రాష్ కనిపిస్తుంది.
ల్యాబ్ పరీక్షలు...
రోగిని పరీక్షిండం ద్వారా నిర్ధారణ కాకపోతే ల్యాబ్ పరీక్షలు చేస్తారు. లాలాజలన్నా వైసర్ పరీక్షకి పంపి తట్టు ఉందో లేదో నిర్థారిస్తారు. మీజిల్స్ వైరస్ దాడి చేత మానవ శరీరం వ్యాధి నిరోధక అంటీ తయారు చేస్తోంది. వాటిని రక్త పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.
ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలి
తట్టు వ్యాధిని గుర్తించిన వెంటనే ఆరోగ్యశాఖకు సమాచారం అందించాలి. వారు ఆ ప్రదేశంలో వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు.
చికిత్స.
మిగితా వైరల్ జబ్బుల వలే తట్టుకు ప్రత్యేకించి చికిత్స లేదు. వ్యాధి లక్షణాలు అనుసరించి మందులు వాడాలి. మిగతా వారితో కలువరాదు. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలి.
వ్యాధి తీవ్రవత వల్ల కలిగే ఉపద్రవాలు (కాంపికేషన్స్)
సాధారణంగా తట్టు వలన చిన్న చిన్న ఉపద్రవాలు సాధరణంగా రావు. అప్పుడప్పుడు ఊపిరితిత్తులకు నిమ్ము చేరి న్యూనమోనియా రావచ్చు. కొద్దిగా అతిసారం జరగవచ్చు. తీవ్రమైన ఉపద్రవాలు మెదడువాపు (ఎన్సెఫలైటీస్) మెనింజైటీస్ అరుదుగా రావచ్చు. తట్టు వచ్చాకా చాలా సంవత్సరాలకు సబ్స్కీరిజింగ్ పాన్ ఎన్సెఫలైటీస్ ఆనేె ఆవిటీ చేసే ఉపద్రవం వస్తుంది. తట్టుకు సంబంధించిన వైరస్ నాడీ వ్యవస్థలో స్తుప్తావస్థలో ఉండి 15 నుంచి 16 సంవత్సరాలకు వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు ఆవిటీ వారుగా, మతిమరుపు, మూర్ఛ వ్యాధితో బాధపడి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో మరణించే అవకాశం ఉంది. పౌష్టికాహారం లేని వారికి వ్యాధి సోకితే మరణించే ప్రమాదం 30శాతం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకున్న కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతారు. వీరికి ముఖ్యంగా విటమిన్ ఏ, జింక్ వంటివి ఇవ్వాలి.