Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాల
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సులభతరమవుతుందని సీఐ మధు తెలిపారు. పట్టణంలోని తహశీల్దార్ రోడ్డు సమీపంలో ఉన్న వ్యాపారస్తులకు సీసీ కెమెరాలపై శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్రమాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు శ్రీకాంత్రెడ్డి, రవీందర్, రవి కిరణ్, పోలీస్ సిబ్బంది, వ్యాపారులు పాల్గొన్నారు.