Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుడిపూడి గోపాల్రావు
నవతెలంగాణ-రాయపర్తి
టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం క్షేమంగా ఉంటుందని మహాకూటమికి వేస్తే సంక్షోభంలో కూరుకుపోతుందని ఆ పార్టీ జిల్లా నాయకుడు గుడిపూడి గోపాల్రావు అన్నారు. మండలంలోని మొరిపిరాలలో గొల్లకుర్మలు శనివారం నిర్వహించిన మల్లన్న పట్నాల వేడుకల్లో ఎర్రబెల్లి ఉషాదయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 57మంది టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగున్నరేండ్లలో జరిగిన అభివృద్ధికి ప్రజలు ఆకర్షితులై మరోసారి అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. గ్రామాల్లో విద్య, వైద్య సదుపాయాలు కల్పనకు నిరంతరం పాటుపడుతున్న ఎర్రబెల్లిని మరోసారి గెలిపించాలని కోరారు. జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం, నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉచితంగా కోచింగ్ ఇప్పించిన ఘనత ఎర్రబెల్లికే దిక్కందన్నారు. పాలకుర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా ఎర్రబెల్లినే గెలిపించాలని ఆయన కోరారు. ప్రజాపోరులో మహాకూటమి చిత్తుగా ఓడిపోవడం ఎంతఖాయమో ఎర్రబెల్లి గెలుపు అంతే ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనిమిరెడ్డి, యూత్ నాయకులు శ్రావణ్కుమార్, సతీష్, సంతోష్, రాజశేఖర్, ఆటో యూనియన్ అధ్యక్షుడు కొమురమల్లు వెంకన్న, రవి, గోపాల్, కిరణ్ పాల్గొన్నారు.
ఎర్రబెల్లి గెలుపే మా లక్ష్యం
ఓటమే ఎరుగని ఎర్రబెల్లి గెలుపే లక్ష్యమే తమ లక్ష్యమని రజక సంఘం మండల అధ్యక్షుడు మచ్చ సత్యం అన్నారు. కుల వృత్తులు అంతరించిపోతున్న తరుణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు. సబ్సిడీ రుణాలు ఇవ్వడంలో ఎర్రబెల్లి పాత్ర కీలకమని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతున్న ఎర్రబెల్లిని గెలిపించడం ప్రతి ఒక్కరీ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కుమార్ పాల్గొన్నారు.