Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాదేవ్పూర్ : మండలంలోని కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో శనివారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హల్కేరి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దేవాలయ మర్యాద ప్రకారం పూజారులు స్వాగతం పలికి దర్శనం అనంతరం ఆమెను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ట్రాన్స్కో డైరెక్టర్ జయంత్రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్తీకమాసం మూడో రోజున దేవస్థానం ఒక రోజు ఆదాయం రూ.2లక్షలు59వేల950 ఆదాయం సమకూరిందని దేవస్థానవర్గాలు తెలిపాయి.