Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి పతనం మొదలైందని, ఆ పార్టీ నాయకులు మతిభ్రమించి చంద్రబాబుపైనా, టీడీపీపైనా ఆరోపణలు చేస్తున్నారని, ఇలా చేస్తే ఆ పార్టీకి పుట్టగతులుండవని టీడీపీ రాష్ట్ర సాంస్కతిక విభాగం కార్యదర్శి ఎస్కే రాజు హెచ్చరించారు. డివిజన్ కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్కు పాలించడం చేతగాక మధ్యలోనే పారిపోయాడని ఎద్దేవా చేశారు. అలాంటి వారిని మళ్లీ గెలిపించాల్సిన అవసరం ప్రజలకు లేదని , మహా కూటమిని గెలిపిస్తేనే సుస్థిరమైన పాలన అందుతుందన్నారు. టీడీపీ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. తాటికొండ రాజయ్య ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మహాకూటమికి గ్రామాలలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు. నాలుగు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమిలో వివాదాలు సహజమేనని, అవన్నీ తాత్కాలికమే అన్నారు. సమావేశంలో సాంస్కతిక విభాగం జిల్లా నాయకులు సమ్మయ్య, భిక్షపతి, రాజు, రవీందర్; వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.