Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
ఎలక్ట్రిషన్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండల అధ్యక్షులు ప్రసాద్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ వద్ద మండల విస్తతస్థాయి సమావేశం సురేందర్రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ కుటుంబంలో 50ఏండ్లుపైబడిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రతి మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్ భవనం ఏర్పాటు చేయాలని, ఎక్స్గ్రేషియో ఆరు లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రయివేటు ఎలక్ట్రిషన్ యూనియన్ ముందుండి పని చేసిందని, అయినా తమకు గుర్తింపు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నారగొని బాలకష్ణ గౌడ్ కుమార్ రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.