Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుర్రం రవీందర్
నవతెలంగాణ-శాయంపేట
మహాకూటమి ముసుగులో వస్తున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్లను మట్టి కరిపించాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్ పిలుపునిచ్చారు. మండలంలోని గోవిందాపూర్లో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసిందని తెలిపారు. మహాకూటమి ముసుగులో రైతన్నలను మోసం చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశానికి ప్రధాని కావాలనే ఆశ తప్ప మరో లక్ష్యం లేని రాహుల్గాంధీకి రైతన్నల కష్టాలు తెలియవని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కాంగ్రెస్, టీడీపీ నాయకులు కోర్టులో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మోటే బాబురావు, ఆకుతోట రమేష్, బుట్టి మహేందర్ టీఆర్ఎస్పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాశ్, పరకాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిర్మల, ఎంపీటీసీ బి రమేష్, నాయకులు పోతు రమణారెడ్డి, మహేందర్ నాయకులు పాల్గొన్నారు.