Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గీసుగొండ
వరంగల్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి నాయిని భరత్ పార్టీని మారే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇనుగాలకు మహాకూటమి నుంచి టికెట్ రాకపోవడంతో ఈ నిర్ణయంతీసుకున్నట్టు సమాచారం. గ్రామీణ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి భరత్ అనేక కార్యక్రమాలు చేపట్టాడు. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసిన వారికి కాకుండా నిన్నమొన్న వచ్చిన వారికి టికెట్ కేటాయించడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలో తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నట్టు విశ్వాసనీయ సమాచారం. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నాయకత్వంలో చేరేందుకు భరత్ సుముఖంగా ఉన్నట్టు తెలిసింది.