Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్ రూరల్
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. పోలీసు అధికారులు సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటిపై డేగ కన్ను పెట్టారు. గతంలో నియోజకవర్గంలో 90 శాతం పోలింగ్ నమోదైన గ్రామాలను, ఒకే అభ్యర్థికి 75 శాతం ఓట్లు పోలైన సందర్భాలు అధిక సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డులు లేని వారు ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఇటీవల అర్నెలల్లో అధిక మంది ఓటర్లు గ్రామాలను వదిలి పెట్టి ఇతర గ్రామాలకు వెళ్లారు. గత ఎన్నికల్లో గొడవలు జరిగిన గ్రామాలు. పోలీసు శాఖ గుర్తించిన గ్రామాలు.. వీటినన్నింటిని కలిపి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. పోలీసులు తరచూ గ్రామాలను సందర్శిస్తున్నారు. ఈ గ్రామాల్లో రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులను బైండోవర్ చేశారు. ఎన్నికల్లో మైక్రో పరిశీలకులను నియమించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు తరుచూ గ్రామాల్లో గ్రామస్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కౌన్సిలింగ్ ఇస్తున్నారు.