Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
టీఆర్ఎస్ అధికారంలోకొచ్చాక కుమ్మరుల సమస్యలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని టీిఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య అన్నారు. డివిజన్కేంద్రంలోని ఓ ప్రయివేటు భవనంలో శనివారం ఏర్పాటు చేసిన తెలంగాణ కుమ్మర సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులకు చేయూతనందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించామన్నారు. ఎన్నికలలో ఎన్నో కూటములు ఏర్పడి టీఆర్ఎస్ను ఓడించే యత్నం చేస్తున్నాయన్నారు. ప్రజల అండ ఉన్నంతకాలం ఎన్ని కూటములొచ్చినా ఎవరూ నమ్మరన్నారు. నియోజకవర్గ కుమ్మరుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సంపత్కుమార్, కుమార్, రంగయ్య, సాంబయ్య, ఉపేందర్, రవికుమార్, రాజు, నరసింహులు పాల్గొన్నారు.