Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ రతన్సింగ్ ఠాగూర్
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని ఉమ్మడి జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు ప్రొఫెసర్ రతన్సింగ్ ఠాగూర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాలతితో కలిసి ఓటరు బాధ్యత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు చట్టప్రకారం అనుసరించాల్సి ఉంటుంద న్నారు. కుల,మతపరమైన బంధాలను ఆసరగా చేసుకుని ఓట్లను అభ్యర్థిస్తున్నారని విమర్శించారు. వాటిని ప్రతి పౌరుడు వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. వివిధ ప్రజా సమూహాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, ఉసిగొల్పడం నేరమన్నారు. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురిచేసి బహుమ తులు ఇస్తామనడం నేరమన్నారు. ఓటర్లను ప్రలో భాలకు గురి చేయకుండా ఉండేందుకు తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక ఏర్పాటు చేశామన్నారు. వీటి అమలు కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా పనిచే యాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పి పుల్లయ్య, వినియోగదారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.