Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద రిక్వెస్ట్ బస్టాఫ్ ఏర్పాటు చేయాలని యూత్ ఫర్ బెటర్ సొసైటీ జనగామ సభ్యులు కె అరుణ్, లక్ష్మణ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్కు వినతి పత్రం ఆందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారన్నారు. అక్కడి నుంచి చౌరస్తాలోని బస్టాండ్కు నడిచి రాలేక ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ జనగామ సభ్యులు ఎం.సాయి కిరణ్, వి.సామ్రాట్, పీ.సాయి, ఎ.నవీన్, రోహిత్, ఎండి ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.