Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
నవతెలంగాణ-పాలకుర్తి
ఏసిరెడ్డినగర్ కాలనీకి తాగునీరందించాలని సీపీిఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా డిమాండ్ చేశారు. మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ ఎదుట ఏసీరెడ్డినగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో మహిళలు శనివారం ధర్నా నిర్వహించారు. సీపీిఐ(ఎమ్ఎల్) లిబరేషన్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎసీరెడ్డినగర్కు తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రత్యేక ట్యాంకు నిర్మాణం చేసి తాగు నీరందించాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పైప్ లైన్ వేయలేదని, ఓట్ల కోసమే మభ్యపెడుతూ ఓట్లు దండు కుంటున్నారని విమర్శించారు. సమస్యకు పరిష్కారం చూపడం లేదని ఆయన అన్నారు. బోరు వేసి తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చ రించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. దీంతో సమస్యను పరిష్క రిస్తామని కార్యదర్శి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పట్టణ కార్యదర్శి జీడి సోమయ్య, మాజీ మండల కో ఆప్షన్మెంబర్, కాంగ్రెస్ నాయకులు ఎండీ సలీం, ఉపాధ్యక్షుడు యాకయ్య, ఏసిరెడ్డి నగర్ అభివృద్ధి కమిటీ నాయకులు నాగరాజు, హరీష్, మల్లికాంబ, గీతారాణి, సత్తమ్మ, ఎలబోయిన సత్తమ్మ, చంద్రమ్మ, రమ పాల్గొన్నారు.