Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రతి ఎన్నికల సందర్భంగా వర్గీకరణపై హామీలు ఇవ్వడం, ఆపై పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు దళితులను మోసం చేస్తున్నాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బల్బుల రమేష్ మాదిగ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి స్వామితో కలిసి ఆయన మాట్లాడారు. వర్గీకరణ బిల్లు కోసం సహకరిస్తామని మాయ మాటలు చెప్పి ఓట్లను దండుకుంటున్నారని అన్నారు. వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుందని,్ల పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టే పార్టీకే ఎమ్మార్పీఎస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు వర్గీకరణకు సహకరించని రాజకీయ పార్టీలను ఓడించేం దుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు సోమారపు వెంకన్న, జిల్లా అధ్యక్షులు ఎడవెల్లి సోమశేఖర్, జిల్లా కార్యదర్శి దండు రామచంద్రు, జిల్లా అధికార ప్రతినిధి ఇనుముల నరసయ్య, నాయకులు వల్లూరి మధు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.