Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
కాశిబుగ్గ నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1994-95 బ్యాచ్కు చెందిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. వివిధ వృత్తి, ఉద్యోగాలలో స్థిరపడి, దూర ప్రాంతాల్లో నివసిస్తున్నవారంతా ఒక చోట కలుసుకోవడంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. తమకు విద్యాబుద్దులు చెప్పిన గురువులను వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రవికుమార్, పూర్వవిద్యార్థులు మేర్గు సుభాష్, అశోక్, నాగరాజు, గణేష్, శ్యామ్, పరందామ పాల్గొన్నారు.