Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరీమాబాద్
ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఎంతమంది వికలాంగులు ఉన్నారనే సమాచారం కోసం అధికారులు శనివారం సర్వే నిర్వహించారు. వీఆర్వో చిరంజీవి ఆధ్వర్యంలో ఖిలావరంగల్ కోట పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి సమాచారం సేకరించారు. అనంతరం సెక్టర్ ఆఫీసర్ సయ్యాద్ మాసూద్ మాట్లాడారు. ఓట్లు వేసే సమయంలో వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.