Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ రతన్ సింగ్ ఠాగూర్
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని ఉమ్మడి జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షులు ప్రొఫెసర్ రతన్ సింగ్ ఠాగూర్ అన్నారు. శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాలతితో కలిసి ఆయన 'ప్రజాస్వామ్యంలో ఓటరు బాధ్యత' పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు కుల,మత, జాతి పరమైన బంధాలను ఆసరాగా చేసుకొని ఓట్లను అభ్యర్థిస్తున్నారని, అలాంటి చర్యలను ప్రతి పౌరుడూ వ్యతిరేకించాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు తెలంగాణ ఎన్నికల నిఘా వేదికను ఏర్పాటు చేశారన్నారు. వీటి అమలుకు ప్రతి పౌరుడు బాధ్యతగా పనిచేయాలన్నారు కార్యక్రమంలో తహశీల్దార్ పి.పుల్లయ్య, వినియోగదారుల సంఘం నాయకులు డాక్టర్ వి.సుధాకర్, గంగు నవీన్ శర్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.