Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గట్టు ప్రసాద్బాబు
నవతెలంగాణ-నయీంనగర్
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి హరీష్రావు చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గట్టు ప్రసాద్బాబు సవాల్ విసిరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ సీఎం అడ్డుకుంటున్నాడని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ముందస్తు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ నాయకులు టీడీపీపై బట్టకాల్చి మీద వేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు అధికారం కట్టబెడితే పాలన చేతకాక నాలుగున్నరేండ్లకే టీఆర్ఎస్ తోకముడిచిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్కు తగిన బుద్ది చెప్పాలని, మహాకూటమి అభ్యర్థులు ఎవరైనా గెలుపే ధ్యేయంగా పని చేస్తామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు హన్మకొండ సాంబయ్య, జిల్లా కార్యదర్శి బైరపాక ప్రభాకర్, నాయకులు గుగులోత్ మోహన్, భూక్యా గణేష్ తదితరులు పాల్గొన్నారు.