Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స.హ చట్టం రాష్ట్ర సలహాదారు పాలడుగుల సురేందర్
నవతెలంగాణ-పోచమైదాన్
ప్రభుత్వ వేతనం పొందుతున్న వారిని రాజకీయ పార్టీల ప్రచారానికి వాడొద్దని స.హ చట్టం రాష్ట్ర సలహాదారుడు పాలడుగుల సురేందర్ అన్నారు. దేశాయిపేటలో వివిధ పార్టీల నాయకులు, సామాజిక విశ్లేషకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ శనివారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవలు ఆ పనులతో వారి సౌకర్యార్థం ఏర్పడ్డ శాఖలని, వీరు ప్రజలకు సేవలకు ఉండాలి అన్నారు. వివిధ శాఖల ద్వారా నేరుగా ప్రజలతో సంబంధాలు ఉన్న మెప్మా, పట్టణ ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశావర్కర్లు, ఆర్పీలు, మహిళ గ్రూప్లను గత నగర పాలకసంస్థ ఎన్నికల్లో ప్రభావితం చేసినట్టు గమనించామన్నారు. వాటిని నియంత్రించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ వీపీ గౌతమ్ను కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాదాసి రాజు, కాంగ్రెస్ నాయకులు బాషబోయిన ధర్మయాదవ్, జూలూరి శ్రీధర్, అవినాష్, నూతన్, సుదర్శన్ పాల్గొన్నారు.