Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
ఈ నెల 14న ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలకు మండల కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ పాఠశాలకు చెందిన ఆకుతోట హరిచందన ఎంపికైయిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆకుతోట శాంతారాంకర్ణ శనివారం తెలిపారు. పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో హరిచందనను పాఠశాల యాజమాన్యం అభినందించింది. అనంతరం ప్రధానోపాధ్యాయుడు శాంతారాంకర్ణ మాట్లాడుతూ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కొత్త ఆలోచనలతో విద్యుత్ను ఆదాచేయడం ఎలా అనే అంశంపై విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలలో 4 నుండి 6వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. 10 జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో ఎ కేటగిరిలో సుజాత విద్యానికేతన్ విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ఎంపికైయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆకుతోట ఊర్మిళ, వైస్ ప్రిన్సిపాల్ ఉమాదేవి, ఉపాధ్యాయులు గుండమీది కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.